ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం నిధులకు రాష్ట్రం ఎందుకు లెక్కలు చెప్పడం లేదు : ఎంపి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 09, 2018, 01:06 PM

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేటాయిస్తున్న నిధుల విషయంలో రాష్ట్రం ఆ నిధులకు ఎందుకు లెక్కలు చెప్పడం లేదని అరకు ఎంపి కొత్తపల్లి గీత ప్రశ్నించారు. కేంద్రం నిధులను ఏం చేస్తున్నారని ఆమె అడిగారు. పోలవరంపై ఖర్చుల లెక్కలను ఎందుకు చెప్పడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటు సాధించిందని చెప్పుకుంటూ ప్రత్యేక హోదా కావాలని ఎలా అడుగుతారని అన్నారు. హోదా కంటే ప్యాకేజి మంచిదని అప్పట్లో సన్మానాలు చేయించుకున్నారని ఆమె ఆరోపించారు.టిడిపితో కలిసి ఉన్నప్పుడు ఇవ్వని హోదా వైసిపి కలిస్తే వస్తుందా అని ఆమె ప్రశ్నించారు.  వైకాపా వైఖరి ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. ఆ పార్టీ అధినేత జగన్‌ కేంద్రాన్ని తిట్టకుండా టిడిపిని మాత్రమే ఎందుకు తిడుతున్నారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలపై టిడిపి వైకాపాలకు చిత్తశుద్ధి లేదన్నారు. పార్లమెంటులో నిరసనలు కేవలం డ్రామా మాత్రమేనని ఆమె చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com