ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడుగడుగునా ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకుంటున్న తెలుగుదేశం ఎంపీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 07, 2018, 12:31 PM

ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని తెలుగుదేశం ఎంపీలు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. సంయమనం పాటించాలని స్పీకర్ పదే పదే చేస్తున్న విజ్ణప్తులను వారు ఖాతరు చేయడం లేదు.  మోడీ ప్రసంగం ప్రారంభించిన వెంటనే తెలుగుదేశం నిరసనలు మరింత ఉదృతమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగిస్తున్నారు. దేశ విభజన పాపం కాంగ్రెస్ దేనని ప్రధాని మోడీ అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పాపం కూడా కాంగ్రెస్ దేనని మోడీ కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు. పార్లమెంటు తలుపులు మూసేసి మరీ రాష్ట్రాన్ని విభజించారని పేర్కొన్నారు.  ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిందని మోడీ చెప్పారు.  కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే ఏపీ విభజనను అడ్డగోలుగా చేశారన్నారు.ఎన్నికల ప్రయోజనాల కోసమే నాటి అధికార కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను విభజించిందని మోడీ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com