నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ 81వ రోజు పాదయాత్ర నిర్వహించనున్నారు. జగన్ తన 81వ రోజు పాదయాత్రను మరికాసేపట్లో ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం అన్నారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు నుంచి ప్రారంభించనున్నారు. పాదయాత్ర దువ్వూరు, సిద్దిపురం, వెంగారెడ్డి పాలెం క్రాస్, గాంధీ జన సంఘం, పల్లెపాలెం క్రాస్, పల్లెపాలెం మీదుగా సంగం వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా సంగంలో జగన్ పాదయాత్ర నిర్వహించనున్నారు. పాదయాత్రలో జగన్ ఇప్పటి వరకు 1079.9 కిలోమీటర్లు నడిచారు.