అమరావతి: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ… చంద్రబాబును విమర్శించే అర్హత సోమువీర్రాజుకు లేదన్నారు. సోమువీర్రాజు ఎజెండా.. బీజేపీదా…? వైసీపీదా? అని ఆయన ప్రశ్నించారు. సోము వీర్రాజుకు జగన్తో జరిగిన ప్యాకేజీ ఏంటో చెప్పాలి?, వైసీపీకి ఎంతకు అమ్ముడుపోయారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు జగన్ మాటలు నమ్మడం లేదని సోము వీర్రాజును వైసీపీ ఏజెంట్గా పంపారని ఎద్దేవా చేశారు. రాజమండ్రిలో అమిత్షా సభ పేరుతో ఎంత కలెక్షన్ చేశారో చెప్పాలన్నారు. సోము వీర్రాజు నీతిమంతుడైతే మేమిచ్చిన ఎమ్మెల్సీని ఎందుకు తీసుకున్నాడని ప్రశ్నించారు. మేమిచ్చిన పదవితో ఊరూరా తిరుగుతూ విమర్శలు చేస్తాడా అని ఆయన సోము వీర్రాజుపై బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.