విజయవాడ: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్ రెండో వార్షికోత్సవం జరుగుతోంది. వార్షికోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. వార్షికోత్సవంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.