ఏపీ క్లౌడ్ హబ్గా మారేందుకు పూర్తి సహకారం అందిస్తామని గూగుల్ ప్రతినిధులు అన్నారు. ఏపీ మంత్రి లోకేశ్ శాన్ఫ్రాన్సిస్కోలో గూగుల ప్రతినిధులతో భేటీ అయ్యారు. భేటీలో గూగుల్ ప్రతినిధులు మాట్లాడుతూ రియల్ టైం గవర్నెన్స్లో అనలిటిక్స్ సేవలకు సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలోనే ఏపీకి ప్రత్యేక బృందాన్ని పంపిస్తామని పేర్కొన్నారు.