ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేవలం మూడు రోజుల్లో పాస్‌పోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 30, 2018, 03:06 PM

ఇకపై కేవలం మూడు రోజుల్లోనే పాస్‌పోర్టును జారీచేయనున్నారు. ఈ మేరకు తాత్కాల్ పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.సాధారణ పద్ధతిలో అయితే పాస్‌పోర్టు జారీకి 10 రోజులు పడుతుంది. దీంతో అత్యవసరంగా పాస్‌పోర్టు కావాల్సినవారు తత్కాల్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే, పాస్‌పోర్టు జారీల విషయంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతుండటంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ క్షేత్రస్థాయిలో అధ్యయనం జరిపి తత్కాల్‌ దరఖాస్తు ప్రక్రియలో మార్పులు చేసిందని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి(ఆర్పీవో) విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు. 


 ఈ సరికొత్త ప్రక్రియలో భాగంగా, దరఖాస్తు చేసుకొనే వ్యక్తి స్వీయ ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్‌ నెంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ ఏవైనా రెండురకాల పత్రాలు(ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, విద్యార్థి ఫొటో ఐడీకార్డు, పాన్‌కార్డు, బ్యాంకు, పోస్టాఫీస్‌ పొదుపు ఖాతా పుస్తకం, పింఛన్‌ డాక్యుమెంట్‌) దరఖాస్తుదారులు సమర్పించాలి. అన్నీ సక్రమంగా ఉంటే రెండు, మూడ్రోజుల్లో పాస్‌పోర్టును జారీచేస్తారు. 


 ఈ కొత్త విధానం ద్వారా పోలీసు వెరిఫికేషన్‌కు ముందుగానే పాస్‌పోర్టు జారీచేసి, ఆ తర్వాత పోలీస్ తనిఖీ చేస్తారు. అలాగే, ఈ విధానం కింద పాస్‌పోర్టు పొందాలనుకునేవారు కూడా అదనపు చార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు కూడా. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com