మల్లాపురం : ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని భారత తొలి ముస్లిం మహిళా ఇమాం జమిదా అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన జమిదా ముస్లిం మహిళలను ప్రధాన స్రవంతిలోనికి తీసుకురావడానికి ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తానన్నారు. 34 ఏళ్ల జమిదా ఖురాన్ సున్నత్ సొసైటీ కార్యదర్శిగా ఉన్నారు.