విజయనగరం: చీపురుపల్లి లో తహశీల్దారు ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు గురువారం జరిగాయి. చీపురుపల్లి పట్టణం లో విద్యార్ధులతో భారీ ర్యాలీ, మానవ హారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ, రెవిన్యూ అధికారులు, మండల విద్యాశాఖాధికారి జె మహలక్ష్మునాయుడు, ఉపాధ్యాయులు మీసాల అప్పలనాడు తదితరులు పాల్గన్నారు. అధికారులు మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన యువతి,యువకులు ఓటు హక్కును పొందాలని సూచించారు.