దావోస్ లో నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. పరస్పర ఆధారిత సమాజాభివృద్దికి చుక్కాని ఆర్థిక వేదిక సదస్సు చుక్కానిగా వ్యవహరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దావోస్ లో నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరై ప్రసంగిస్తున్నారు. 20ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రధాని అక్కడ ప్రసంగిస్తున్నారు. ఈ సదస్సుకు హాజరుకావడం ఆనందదాయకంగా ఉందని మోడీ తెలిపారు. టెక్నాలజీ ప్రజా జీవితాలను పూర్తిగా మార్చేసిందని తెలిపారు. 1997లో భారత జీడీపీ 400 బిలియన్ డాలర్లు మాత్రమేనని, ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయన్నారు. భారత్ లో పెట్టుబడులకు అవకాశాలను ప్రధాని మోడీ ప్రపంచ ఆర్థిక సదస్సులో వివరిస్తున్నారు. సైబర్ టెక్నాలజీ దుర్వినియోగంపై దృష్టి పెట్టామని తెలిపారు. భారత్ లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయన్నారు. పర్యావరణ మార్పులు భయపెడుతున్నాయన్నారు. మానవ సమాజాన్ని సరైన మార్గంలో నడిపించడం మనందరి ముందున్న ప్రధాన సవాల్ అని మోడీ అన్నారు. వసుదైక కుటుంబం అనేది భారతీయ తాత్విక చింతన అని అన్నారు. వసుదైక కుటుంబం అనే భావనను భారత్ ప్రపంచానికి ఎప్పుడో చాటిచెప్పిందన్నారు. వసుదైక కుటుంబం అనేది ఇప్పటికీ, ఎప్పటికీ సరిపోయే నినాదమని మోడీ అన్నారు.