భర్త మోసం చేశాడని, చిత్రహింసలు పెడుతున్నాడని భార్య కోర్టు మెట్లెక్కడం సర్వసాధారణం. దీనికి భిన్నంగా భార్య తనను వేధిస్తోందంటూ ఓ భర్త ఫిర్యాదు చేశాడు. ఈ పిటిషన్ను విజయవాడ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణకు స్వీకరించింది.విజయవాడకు చెందిన గోగు రామ్కుమార్కు నాగజ్యోతితో గత ఆగస్టు 11న వివాహమైంది. పెళ్లయిన రెండు నెలలకే వివాదాలు మొదలయ్యాయి. ''నన్ను చేసుకోవడానికి ముందే ఆమెకు పెళ్లయింది. సంతానమూ ఉన్నారు. విడాకులు తీసుకున్న విషయాన్ని గానీ, పిల్లలు ఉన్నారన్న విషయాన్ని గానీ నాకు చెప్పలేదు. ఆ విషయం అడిగినందుకు.. నన్ను చిత్రహింసలు పెడుతోంది.
నాపై 498(ఎ) పెట్టి, రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. నేను సాధారణ మెకానిక్ని. అంత డబ్బు ఇచ్చుకోలేను. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించాను'' అని పిటిషన్లో సదరు భర్త వాపోయాడు. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చేనెల 21వ తేదీన కోర్టు చేపట్టనుంది.