మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన భాగస్వామిగా కొనసాగుతోందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. శివసేన పొత్తుతో ఏర్పడిన మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో కొనసాగుతుందని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోరాటం చేయనున్నదనే అంశంపై ఫడ్నవీస్ స్పందించారు. శివసేన నేతలు అనేక విషయాలను చెబుతుంటారని ఆయన అన్నారు. ఏం జరుగుతుందో వేచి చూద్దామని ఆయన చెప్పారు.