ముంబై : ముంబైలోని అంధేరీలో ఉన్న పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక దళానికి చెందిన ఇద్దరు ఈ మంటల్లో గాయపడ్డారని ఫైర్ బ్రిగేడ్ అధికారి ఒకరు చెప్పారు. సుమారు 8 ఫైరింజన్లతో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ అధికారి చెప్పారు. గ్రౌండ్ ప్లస్ వన్ ఉన్న భవనంలో అగ్ని ప్రమాదం జరిగిందని, ఎలెక్ట్రికల్ వైరింగ్, మొదలైనవి మంటలకు అంటుకున్నాయని ఆయన అన్నారు.