న్యూఢిల్లీ: ఉగ్రవాది అబ్దుల్ సుభాన్ ఖురేషి అలియాస్ తౌకీర్ను పోలీసులు అరెస్టు చేశారు. 2008లో గుజరాత్లో జరిగిన వరుస పేలుళ్లలో ఖురేషి ప్రధాన నిందితుడు. దాదాపు పదేళ్లుగా పోలీసులు అతని కోసం వేటాడారు. అతను స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) గ్రూపుకు చెందినవాడు. ఇండియన్ ముజాహిద్దిన్ సభ్యుడిగా కూడా ఉన్నాడు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాద జాబితాలోనూ ఖురేషి పేరుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ బాంబులు తయారు చేయగల సమర్థుడున్న మరోపేరు కూడా అతనికి ఉంది. ఇండియాలో అతన్ని ఒసామా బిన్ లాడెన్ పేరుతో పిలుస్తారు. 2006లో ముంబైలో జరిగిన పేలుళ్లలోనూ అతని పాత్ర ఉన్నట్లు అనుమానాలున్నాయి. ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్ పోలీసులు ఖురేషిని అరెస్టు చేశారు.
We have arrested India most wanted terrorist Abdul Subhan Qureshi who is also the founder of Indian Mujahideen. He was again trying to revive Indian Mujahideen: DCP Pramod Kushwaha, Special Cell #Delhi pic.twitter.com/lAemT8b7Er
— ANI (@ANI) January 22, 2018
Abdul Subhan Qureshi was living with forged documents in Nepal. He came back to India to revive Indian Mujahideen: DCP Pramod Kushwaha, Special Cell #Delhi pic.twitter.com/lSigZRk4FY
— ANI (@ANI) January 22, 2018