తమిళనాడు ప్రభుత్వం బస్సు ఛార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తూ విభిన్న రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోయంబత్తూరు పెంచిన బస్సు ఛార్జీలకు వ్యతిరేకంగా ఓటింగ్ నిర్వహించారు. ప్రజలు భారీ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని బస్సు ఛార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. ఓటింగ్ పూర్తయ్యాకా ఓట్లు వేసిన డబ్బాలను ముఖ్యమంత్రికి పంపించనున్నారు.