ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టపోయిన వారికి భూములు ఇప్పించేందుకు సహకరించాలని కోరా: మంత్రి కామినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2018, 12:20 PM

కొల్లేరు ప్రజలకు బతుకుదెరువు కల్పించేలా సమస్య పరిష్కరించాలని, భూములు నష్టపోయిన వారికి భూములు ఇప్పించేందుకు సహకరించాలని కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ను కోరారని మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. ఢిల్లిdలో కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ను కలిసిన అనంతరం మంత్రి కామినేని మాట్లాడారు. కొల్లేరు భూముల వ్యవహారంపై పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. కొల్లేరులో కాంటూరు తగ్గించే అంశాన్ని వివరించగా సాంకేతికపరమైన అంశాలను పర్యావరణ శాఖ కార్యదర్శులకు వివరించాలని సూచించారని, కాంటూరు తగ్గించే అంశం సుప్రీంకోర్టు పరిధిలోని అంశమని తెలిపారని వివరించారు. 133 సొసైటీలు, పర్యావరణం, నీటికి ఇబ్బంది కలగకుండా సమస్య పరిష్కరించాలని కోరానన్నారు. ఫిబ్రవరిలో కైకలూరు ఆటపాకలో ‘పెలికాన్‌ ఫెస్టివల్‌’ నిర్వహిస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com