న్యూఢిల్లీ :ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ ఎంపి శత్రుఘ్నసిన్హా మద్దతుగా నిలిచారు. ఆ పార్టికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనిపై శత్రుఘ్నసిన్హా ఒక ట్వీట్ లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సత్యం ఉందని పేర్కొన్నారు.విభేద రాజకీయాలు ఎక్కువ కాలం మనలేవని తన సొంతపార్టీ అయిన బీజేపీపై చురకలు వేశారు.