కోల్కతా : కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్టు (సిపిఎం) పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ సీతారాం ఏచూరి చెప్పారు. ఈ ఏరకు పార్టీ సెంట్రల్ కమిటీ ఒక రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించిందని ఆయన అన్నారు. మూడు రోజులపాటు జరిగిన సిపిఎం సెంట్రల్ కమిటీ సమావేశం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. రాజకీయ ముసాయిదా తీర్మానం ప్రకారం కాంగ్రెస్ పార్టీతో అవగాహనకు రావడం కాని, ఎన్నికల పొత్తు పెట్టుకోవడం కాని జరిగే అవకాశాలు లేవని ఆయన చెప్పారు. అయితే ఇది ముసాయిదా తీర్మానం మాత్రమేనని, పార్టీలోని అత్యున్నత నిర్ణాయక సభ్యులు తీసుకుంటారని ఆయన చెప్పారు.