న్యూఢిల్లీ: 20 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల అనర్హతపై నోటిఫికేషన్ జారీ అయింది. ఎన్నికల సంఘం ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదించారు. లాభదాయకమైన పదవుల అంశంపై ఆప్ ఎమ్మెల్యేలపై ఈసీ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్లో ఉన్నారంటూ ఎన్నికల సంఘం ఆరోపించింది. ఈ సమస్యకు సంబంధించి ఎన్నికల సంఘం తన ప్రతిపాదనలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు పంపించింది. దీంతో ఆ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 63 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి 20 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుతో ప్రస్తుతం వారి బలం 43కు చేరింది.