అమరావతి : ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం జరిగిన డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ సమ్మిట్ ఆన్ ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్-2018 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ అవార్డు అందుకున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివఅద్ధి శాఖల్లో టెక్నాలజీ అనుసంధానంతో గ్రామాల అభివఅద్ధికి తీసుకుంటున్న చర్యలు, అధునాతన సాంకేతికతతో పంచాయతీ రాజ్ శాఖకు రూపొందించిన డ్యాష్ బోర్డ్కు గాను లోకేష్కు డాక్టర్ కలామ్ ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డ్-2018 అవార్డు దక్కింది.