మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్తో సహా 160 మంది ప్రయాణిస్తున్న ఢిల్లీ గువాహటి ఇంపాల్ ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. గువాహటి విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా పక్షి అడ్డం రావడంతో ప్రమాదం సంభవించింది. దీంతో ప్రయాణికులు గుహవాటి విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. తాము ప్రయాణించిన విమానానికి పక్షి అడ్డం వచ్చిందనీ, అయినప్పటికీ సురక్షితంగా గువాహటిలో ల్యాండింగ్ అయ్యిందని బీరేన్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ప్రతినిధి ధ్రువీకరించారు. తమ ఇంజనీర్ల విభాగం విమానాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. గువాహటి విమానశ్రయంలో ఎయిర్ ఇండియా నిర్వహణ సరిగా లేదని బీరేన్ మరో ట్వీట్ చేశారు. ఇక్కడ ముగ్గురు ఎయిర్ ఇండియా అధికారులు మాత్రమే ఉన్నారని, శనివారం మధ్యాహ్నం వరకు విమానాలేవీ అందుబాటులో లేవని అధికారులు చెప్పారని ఆయన పేర్కొన్నారు.