అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో కేంద్ర మంత్రి సుజనాచౌదరి శనివారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రధానమంత్రితో భేటీ వంటి అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్ర విజ్ఞప్తులపై అదనపు వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం కోరింది. దీంతో పీఎంవో అడిగిన వివరాలు, ముఖ్యమైన పెండింగ్ సమస్యలపై వీరు చర్చించారు.