న్యూఢిల్లీ: విభజన హామీలపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు(కాంగ్రెస్) శనివారం లేఖ రాశారు. నాలుగేళ్లయినా విభజన హామీలు అమలు కాలేదని లేఖలో పేర్కొన్నారు. హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజాల పరిరక్షణ కోసం కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.