భోపాల్ : గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ను మధ్యప్రదేశ్ గవర్నర్గా రాష్ట్రపతి నియమించారు. గుజరాత్తో పాటు మధ్యప్రదేశ్ గవర్నర్గా వ్యవహరిస్తున్న ఓం ప్రకాష్ కోహ్లీ నుంచి ఆమె భాద్యతల్ని స్వీకరించనున్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్గా ఆనందీ బెన్ను రాష్ట్రపతి ప్రకటించారని, నిర్ణయించిన తేదీ నుండి ఆమె పదవీ బాధ్యతల్ని చేపట్టనున్నారని టిట్టర్లో రాష్ట్ర పతి భవన్ పేర్కొంది. 2014లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంపికైన ఆమె 2016లో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.